AP 10th Results Good News:
AP 10th Results Good News: ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఫెయిల్ అయిన విద్యార్థులకు శుభవార్త.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్ గానే పదో తరగతి ఫలితాలు వచ్చాయి. అయితే కొంతమంది విద్యార్థులు కొన్ని సబ్జెక్టులలో ఫెయిలయ్యారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎవరైతే ఫెయిలయ్యారో వాళ్లకి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈసారి నిర్వహించబోయే సప్లమెంటరీ పరీక్షల్లో విద్యార్థులందరూ తప్పనిసరిగా ఉత్తీర్ణలు కావాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి సప్లమెంటరీ పరీక్షల్లో మెరుగైన ఉత్తీర్ణత శాతం కచ్చితంగా ఉండాలి దాన్ని సాధించే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తామని ఉద్దేశంతో విద్యార్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి తరగతులు నిర్వహించి వారికి మంచి మార్కులు వచ్చే విధంగా విద్యాశాఖ ముందుకు వెళుతుంది. ఈ నెల 19వ తేదీ నుంచి పరీక్షలో జరగనున్న నేపథ్యంలో 18 వరకు కూడా స్పెషల్ క్లాసులు ఏర్పాట్లు చేయాలని అధికారులు భావించారు.
క్లాసులో ఏర్పాట్లు చేయాలని మరియు కోచింగ్ సెంటర్ లను మండల కేంద్రాలలో ఏర్పాట్లు చేయాలని ఒకవేళ సాధ్యపడకపోయినా పక్షంలో స్కూళ్లలోనే ఈ క్లాసెస్ అన్ని కూడా నిర్వహించాలని విద్యాశాఖ పేర్కొంది.
కాబట్టి విద్యార్థులు ఎవరైతే పదో తరగతిలో ఫెయిలయ్యారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఫలితాలతో సప్లమెంటరీ పరీక్షలు అనేవి పాస్ అవ్వండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Careers లో ప్రతిరోజు ముఖ్యమైన Job Updates ఇస్తున్నాం. కావున ప్రతి ఒక్కరూ మన వెబ్సైట్ని Daily Visit చేసి, మీకు అర్హతలు ఉన్న ఉద్యోగాలకు Apply చేసుకోండి.